మధుమేహం ఉన్నవారు మొక్కజొన్నను ఎక్కువగా తీసుకుంటే మంచిది. వీటిలో అధికంగా లభించే పీచు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది,త్వరగా కరగదు. మలబద్ధక సమస్యనూ నివారిస్తుంది. ఈ స్వభావమే పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. మరి ఇవాళ కార్న్ తో దోశలు వేసుకుందామా..
కావలసిన వస్తువులు:
లేత మొక్కజొన్న గింజలు – 1/2 కప్పు
బియ్యం -2 కప్పులు
పచ్చిమిరపకాయలు – 4
జీలకర్ర – 1/2 tsp
ఉప్పు – తగినంత
నూనె – 1/4 కప్పు
బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. తర్వాత నానిన బియ్యం, లేత మొక్కజొన్న గింజలు/కార్న్ కలిపి మెత్తగా రుబ్బుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి , జీలకర్ర, తగినంత ఉప్పు వేసి కలపాలి. పెనం వేడి చేసి ఈ పిండితో పలుచగా దోశలు వేసుకుని చుట్టూ కొద్దిగా నూనె వేసి తిరగేయకుండానే కొబ్బరి లేదా టమాట పచ్చడితో వడ్డించండి.

11:28 PM on March 1st, 2011 1
జ్యోతీ గారికి, your’s corn special theme ?is too gud.its not only gud for diabetics but others also. Corn Dosa seems to be good. May be I need some clarity? Should i add soda? is it the usual rice or boiled rice? Any way for making this item no need to plan in advance. A lovely weekend break fast.thnx
12:35 PM on March 2nd, 2011 2
Kavitha,, No need to add any soda .I used normal rice and made it instantly. you can see the result. got very thin dosa’s… try it..
2:36 PM on March 15th, 2011 3
మన తెలుగు ఇంటి వంటలను ప్రపంచం నలుమూలల ప్రచారం చెసి మన గొప్పతనం చాటినందుకు మేమేంతొ అనంద పడుతున్నాము
6:52 PM on March 29th, 2013 4
సుపెర్గ ఉంది